Monday, June 24, 2013

NATIONAL_CURRENTAFFAIRS_2013_TELUGU(24JUNE)

జూన్ 2013 జాతీయం ::.

              
ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగిన జేడీయూ
జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు జేడీయూ (జనతాదళ్‌ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ జూన్‌ 16న ప్రకటించారు. దీంతో 17 ఏళ్లుగా ఉన్న రెండు పార్టీల పొత్తు ముగిసింది. బీహార్‌లో జేడీయూ సారధ్యంలో ఉన్న ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి 11 మంది బీజేపీ మంత్రులను బర్త్ఫ్‌ చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తెలిపారు. బీహార్‌లో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న జేడీయూకు బీజేపీ మద్దతిస్తోంది. బీహార్‌ అసెంబ్లీలోని 243 స్థానాల్లో జేడీయూకు 118 స్థానా లు, బీజేపీకి 91, ఆర్‌జేడీకి 22 మంది శాసనసభ్యులుండగా, మిగిలిన పార్టీలకు చెందినవారు 12 మంది ఉన్నారు.

కేంద్ర కేబినెట్‌లో 12కు పెరిగిన రాష్ట్ర ప్రాతినిధ్యం
ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జూన్‌ 17న తన మంత్రివర్గంలో కొత్తగా 8 మందిని చేర్చుకున్నారు. దీంతో మొత్తం కేబినెట్‌ సంఖ్య 77కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి స్థానం కల్పించారు. ఏలూరు నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కావూరి సాంబశివరావుకు కేబినెట్‌ హోదాతో జౌళి శాఖ దక్కగా, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలంకు ఆర్థికశాఖ సహాయమంత్రి పదవి లభించింది. కావూరితోపాటు కేబినెట్‌ మంత్రులుగా శీశ్‌రాం వోలా (కార్మిక శాఖ), ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ (ఉపరితల రవాణా), గిరిజా వ్యాస్‌ (గహ నిర్మాణం, పేదరిక నిర్మూలన) నియమితులయ్యారు. జేడీ శీలంతోపాటు సహాయమంత్రులుగా నియమితులైనవారిలో నాచియప్పన్‌ (వాణిజ్యం, పరిశ్రమలు), శ్రీమతి సంతోష్‌కుమార్‌ (ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), మాణిక్‌రావ్‌ గువిట్‌ (సామాజిక న్యాయం, సాధికారత) ఉన్నారు.

160 ఏళ్ల టెలిగ్రాఫ్‌ సర్వీస్‌ రద్దు
160 ఏళ్లపాటు నడిచిన టెలిగ్రాఫ్‌ సర్వీసును జూలై 15 నుంచి నిలిపేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. భారత్‌లో తొలిసారి 1850లో కలకత్తా - డైమండ్‌హార్బర్‌ మధ్య ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ లైన్‌ ఏర్పాటైంది. 1851లో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవసరాల కోసం టె లిగ్రాఫ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. 1853లో ఈ సౌకర్యాలు ప్రజలకందించేందుకు ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌ ప్రారంభమైంది. ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ను 1832లో షిల్లింగ్‌ కనుక్కొన్నారు.

సులభ్ వ్యవస్థాపకుడికి ఫ్రెంచ్ అవార్డ్
ప్రముఖ పర్యావరణవేత్త సులభ్ ప్రాజెక్టువ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం లెజెండ్ ఆఫ్ ప్లానెట్అవార్డును అందజేసింది. జూన్ 3న పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనెట్ ఉపాధ్యక్షురాలు చంటల్ జోర్దాన్ ఆయనకు ఈ అవార్డును బహూకరించారు. భారత్‌లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పెంపుదలకు విశేషంగా కషి చేసిన వ్యక్తిగా పాఠక్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. 1973లో సులభ్ ఇంటర్నేషనల్‌ను స్థాపించి సులభ్ కాంప్లెక్స్ పేరుతో దేశంలో మరుగుదొడ్ల విప్లవానికి ఆయన నాంది పలికారు.

నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రోష్నీ
దేశంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని యువత కోసం రోష్నీ పేరిట కొత్తగా నైపుణ్య అభివద్ధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖా మంత్రి జైరాం రమేశ్ జూన్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని అత్యంత సమస్యాత్మకమైన నక్సల్స్ ప్రభావిత 24 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా ఇందుకు ఎంపికైంది. యువతలో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే రోష్నీ పథకం లక్ష్యమని మంత్రి చెప్పారు. రానున్న మూడేళ్లలో దేశంలోని 24 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో 18 నుంచి 35 ఏళ్లలోపున్న 50వేల మంది యువతీయువకుల జీవితాల్లో రోష్నీ పథకం వ్యాపార, ఉద్యోగాల ద్వారా వెలుగు నింపనుందని తెలిపారు. కేంద్రం 75 శాతం, రాష్ట్రాల నుంచి 25 శాతం భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవస్థీకత రంగంలో ఉపాధి కల్పించేందుకు వీలుగా నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు చెందిన యువతీయువకులను ఈ పథకం కింద గుర్తించి వారికి తగిన శిక్షణ అందిస్తారు.

సైనిక శిక్షణపై భారత్ - సింగపూర్ ఒప్పందం
భారత్‌లో సింగపూర్ సైన్యం శిక్షణ, విన్యాసాల సౌకర్యాలు ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్- సింగపూర్‌లు జూన్ 4న సంతకాలు చేశాయి. భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోని సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఇటువంటి ఒప్పందాలు ఇరుదేశాల మధ్య 2007, 2008లో కుదిరాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సింగపూర్ సైనిక శిక్షణ కార్యక్రమాలు ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఐదేళ్లపాటు కొనసాగుతాయి. భారత శిక్షణా, విన్యాసాల సౌకర్యాలు పొందుతున్న ఏకైక దేశం సింగపూర్.

అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సదస్సు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతత్వంలో అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశం జూన్ 5న న్యూఢిల్లీలో జరిగింది. నక్సల్ సమస్య ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో మే 25న జరిగిన మావోయిస్టుల దాడిని సమావేశంలో పాల్గొన్నవారందరూ ముక్తకంఠంతో ఖండించారు. దేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యల్లో నక్సలిజం అతిపెద్ద సమస్యని ముఖ్యమంత్రులంతా అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్‌సీటీసీ)ను విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధమన్నారు. కాగా నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు ఏకీకత విధానాన్ని అవలంబించాలని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు తీర్మానించాయి. ముఖ్యమంత్రుల సమావేశంలో భాగంగా 9 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో హోంశాఖ భేటీ నిర్వహించింది. నక్సల్స్‌పై పోరులో ఆంధ్రప్రదేశ్ మార్గాన్ని అనుసరించాలని 9 రాష్ట్రాలూ అంగీకరించాయి.

భారత ప్రధాని మన్మోహన్ జపాన్ పర్యటన
జపాన్ పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 29న ఆ దేశ ప్రధాని షింజో అబెతో చర్చలు జరిపారు. చర్చల తర్వాత పౌర అణు సహకార ఒప్పందం కోసం చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. 2011 మార్చిలో జరిగిన ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత అణు సహకారంపై చర్చలు ఆగిపోయాయి. జపాన్‌తో ఒప్పందం కుదిరితే ఆ దేశం నుంచి అణు రియాక్టర్లను పొందే అవకాశం భారత్‌కు లభిస్తుంది. అదేవిధంగా సముద్ర జలాల భద్రతలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్- జపాన్ నిర్ణయించాయి. ముంబై మెట్రోలైన్-3, హైదరాబాద్ ఐఐటీలో రెండో దశ పనులు సహా ఎనిమిది ప్రాజెక్టుల కోసం భారత్‌కు రూ. 23.86 లక్షల కోట్ల రుణ సహాయం చేసేందుకు కుదిరిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన పనులు వేగవంతం చేయాలని కూడా జపాన్ నిర్ణయించుకుంది. ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే లైన్‌పై ఉమ్మడి అధ్యయనానికి ఆర్థిక సహాయంపై కూడా ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా నికోబార్ దీవులు
భారత్‌లోని నికోబార్ దీవులను యునెస్కో వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా మే 30న ప్రకటించింది. స్థానిక సమాజ చర్యలాధారంగా సుస్థిర అభివద్ధిని ప్రోత్సహించే కార్యక్రమంలో (మాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్) భాగంగా యునెస్కో నికోబార్ దీవులను గుర్తించింది. ప్రకతి, మానవ కార్యకలాపాలను నిర్వహించే కొత్త విధానాలను ఈ ప్రాంతంలో పరీక్షిస్తారు. నికోబార్ దీవులు 1800 జంతు జాలాలకు, అంతరిస్తున్న గిరిజన తెగలకు ఆవాసంగా ఉన్నాయి. నికోబార్ దీవులతోపాటు మరో 11 ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్ పరిధిలోకి తెస్తూ పారిస్‌లో మే 30న యునెస్కో ప్రకటించింది.

ఐదోసారి రాజ్యసభకు ఎంపికైన మన్మోహన్ సింగ్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అసోం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీలో 49 తొలి ప్రాధాన్యత ఓట్లతో ప్రధాని ఎన్నికైనట్లు మే 30న ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నేరస్తుల అప్పగింత ఒప్పందంపై భారత్ - థాయ్‌లాండ్ సంతకాలు
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ థాయ్‌లాండ్ పర్యటనలో మే 30న ఇరుదేశాలు నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉగ్రవాద, ఆర్థిక, ఇతర అంతర్జాతీయ నేరాలతో సంబంధమున్న నేరస్థుల అప్పగింతకు ఈ ఒప్పందం చట్టబద్ధత కల్పిస్తుంది. థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాతో మన్మోహన్ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు కూడా జరిపారు. మనీల్యాండరింగ్‌ను, ఉగ్రవాదులకు నిధుల చేరవేతను అడ్డుకొనేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. శిక్ష అనుభవిస్తున్న ఖైదీల మార్పిడి, జియోస్పేషియల్ టెక్నాలజీ, మ్యాపుల తయారీ, విద్యా రంగంలో సహకారంలో కూడా ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. బీహార్‌లోని బుద్ధగయలోని పవిత్ర బోధి వక్షానికి చెందిన మొక్కను థాయ్‌లాండ్ రాజు భూమిబల్‌కు ప్రధాని కానుకగా ఇచ్చారు. థాయ్‌లాండ్ పాలకులకు భారత్ బోధి మొక్కను అందజేయడం ఇదే తొలిసారి.

ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు
రాజకీయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 3న కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు కూడా ప్రజా సంస్థలేనని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అవి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆరు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పరోక్షంగా పెద్ద ఎత్తున నిధులు పొందుతున్నాయని తెలిపింది. ప్రజా సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున.. ఆర్టీఐ చట్టంలోని ప్రజా సంస్థల లక్షణం పార్టీలకున్నట్లేనని చెప్పింది. సీఐసీ పూర్తిస్థాయి ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో తమకు ఏ విధంగా నిధులు వస్తుందీ, ఎలా ఖర్చు పెడుతుందీ, ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరు వారాల్లోగా తమ ప్రధాన కార్యాలయాల్లో కేంద్ర ప్రజా సమాచార అధికారులను (సీపీఐఓ), పునర్విచారణ అధికారులను (అప్పిలేట్ అథారిటీ) నియమించాలని సీఐసీ ధర్మాసనం రాజకీయ పార్టీలను ఆదేశించింది.

పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు
పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి వివిధ కేటగిరీల రిజర్వేషన్ శాతాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేస్తారు. జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గ్రామపంచాయతీలైతే ఎస్టీలకు 6.28, ఎస్సీలకు 19.43, బీసీలకు 34 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తారు. మండల పరిషత్‌లైతే ఎస్టీలకు 6.99 శాతం, ఎస్సీలకు 19.32 శాతం, జిల్లా పరిషత్‌లైతే ఎస్టీలకు 9.15 శాతం, ఎస్సీలకు 18.88 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మిగిలిన స్థానాలు జనరల్ కేటగిరీకి ఉద్దేశించినవి. ఈ నాలుగు కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల సమాచారం అందిన వారం రోజుల్లోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌లో యువ పార్లమెంటేరియన్ల సదస్సు
హైదరాబాద్‌లో అక్టోబర్ 21 నుంచి ఐదు రోజులపాటు యువ పార్లమెంటేరియన్ల సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును హైదరాబాద్‌లో జరపాలని కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) నిర్ణయించినట్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మే 29న తెలిపారు. దేశంలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ సదస్సులో 54 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. దేశంలోని అన్ని అసెంబ్లీల యువ ప్రజా ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. విద్య, పేదరికం నిర్మూలన వంటి అంశాలకు సంబంధించి చట్ట సభల బాధ్యతపై సదస్సులో చర్చిస్తారు.


మే 2013 జాతీయం ::.

              
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో 24 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దక్షి ణ బస్తర్ ప్రాంతంలో మే 25న మావోయిస్టులు జరిపిన దాడిలో 24 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మరికొద్ది నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ పరివర్తన్ యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగా జరిగిన సభలో పాల్గొని వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చి, ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి పలువురు నేతలను హతమార్చారు. వీరిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ, పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, పలువురు నేతలు ఉన్నారు.

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
నావికాదళ నూతన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ తర్కష్ నుంచి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. గోవా తీరంలో మే 22న నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత మార్గంలో ప్రయాణించి బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ ఎ.శివథానుపిళై ్ల వెల్లడించారు.

గుర్గావ్‌లో తొలి రక్షణ విశ్వవిద్యాలయం
హర్యానాలోని గుర్గావ్‌లో బినోలా వద్ద ఏర్పాటు చేస్తున్న తొలి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 23న శంకుస్థాపన చేశారు. ఐఐటీ, ఐఐఎం స్థాయిల్లో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం 2018నాటికి పనిచేయడం ఆరంభిస్తుంది. ఇందులో రక్షణ అధ్యయనాలు,రక్షణ నిర్వహణ,రక్షణకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీల్లో ఉన్నత విద్యను అందిస్తారు. ఇం దులో సైనిక దళాల నుంచి 66 శాతం, ఇతర ప్రభుత్వ సంస్థ ల నుంచి 33 శాతం విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.

మలయాళంకు ప్రాచీన భాష హోదా
మలయాళం భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ మే 23న నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3.33 కోట్ల మంది మలయాళం మాట్లాడేవారున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన నాలుగో భాష మలయాళం. ఇప్పటికే తమిళం, కన్నడం, తెలుగు భాషలకు ఈ హోదా దక్కింది. ఈ హోదా వల్ల మలయాళం భాష, సాహిత్యాలను ప్రోత్సహించేందుకు అనేక ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. కేంద్రం నుంచి రూ. 100 కోట్ల సహాయం దక్కుతుంది. అంతేకాకుండా వివిధ విశ్వవిద్యాలయాల్లో మలయాళం పీఠం ఏర్పాటు చేసేందుకు యూజీసీ తోడ్పడుతుంది.

పిల్లల గల్లంతుపై సుప్రీం మార్గదర్శకాలు
గల్లంతైన పిల్లలతోపాటు ఇతర నేరాలకు బాధితులైన బాలల రక్షణకు సంబంధించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. బచ్‌పన్ బచన్ ఆందోళన్ (బీబీఏ) అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల గల్లంతు, వారి అక్రమ తరలింపు సమస్యలపై దాఖలు చేసిన పిటిషన్‌ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశంలో 2009-11 కాలంలో 75,808 మంది పిల్లలు కనిపించకుండా పోయినట్లు గణాంకాలు చెబుతుండగా, పిల్లల గల్లంతుకు సంబంధించి ఇంతవరకు నమోదుకాని కేసుల్లో నెల్లాళ్ల వ్యవధిలోనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తగిన ఆధారాలు లభించేంత వరకు పిల్లల గల్లంతు కేసులన్నింటినీ కిడ్నాప్ కేసులుగానే పరిగణించాలని స్పష్టం చేసింది. బాలలపై నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లోను సుశిక్షితుడైన అధికారిని బాలల సంక్షేమ అధికారిగా నియమించాలని ఆదేశించింది.

ఢిల్లీలో 45వ భారత కార్మిక సదస్సు
45వ భారత కార్మిక సదస్సు ఢిల్లీలో మే 17న జరిగింది. ఈ సదస్సును ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2004 నుంచి 2010 వరకు ప్రభుత్వం 20 మిలియన్ల అదనపు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఇదే కాలంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిందన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా (కె.జి. సేన్‌గుప్తా) నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మే 21న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్‌గుప్తాతో గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు జస్టిస్ సేన్‌గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1953లో కోల్‌కతాలో జన్మించిన జస్టిస్ సేన్‌గుప్తా 1981లో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

గూగుల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్‌వర్క్స్.. గూగుల్ ఇండియాతో ఓ అవగాహన ఒప్పందంపై మే 14న సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద ఇంజనీరింగ్ విద్యార్థులకు, బోధకులకు గూగుల్ శిక్షణ ఇస్తుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గూగుల్ సంస్థ ప్రతినిధి నెల్సన్ మట్టోస్ పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. గూగుల్.. దేశంలో విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన ఆధునిక టెక్నాలజీల్లో గూగుల్ శిక్షణ ఇస్తుంది. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తుంది.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం

కర్ణాటక శాసనసభకు మే 5న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను 121 స్థానాలను కైవసం చేసుకుంది (ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాలు సరిపోతాయి). అధికార బీజేపీకి 40 స్థానాలు మాత్రమే దక్కాయి. మాజీ ప్రధాని దేవెగౌడ నేతత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చెందిన కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ)కి ఆరు స్థానాలు దక్కాయి. మరో ప్రాంతీయ పార్టీ బీఎస్‌ఆర్‌సీపీకి నాలుగు స్థానాలు లభించాయి. 2008 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్‌కు అదనంగా 2.46 శాతం మేర ఓట్లు వచ్చాయి. బీజేపీ దాదాపు 13.4 శాతం ఓట్లను కోల్పోయింది.
మొత్తం స్థానాలు: 224
ఎన్నికలు జరిగిన స్థానాలు: 223
గెలిచిన స్థానాలు
(ఓట్ల శాతం)
కాంగ్రెస్:
121
(36.55)
బీజేపీ:
40
(19.97)
జేడీఎస్:
40
(20.09)
ఇతరులు:
22
(-)
2008 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80, బీజేపీకి 110, జేడీఎస్‌కు 12, ఇతరులకు 6 స్థానాలు దక్కాయి.

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మే 13న ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా సిద్ధరామయ్యను మే 10న పార్టీ శాసనసభ్యులు ఎన్నుకున్నారు.

19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణ

దేశంలో అనేక ప్రాంతాల్లో 19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 4.87 లక్షల హెక్టార్లు, అస్సాంలో 3.30 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.57 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 1.83 లక్షల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది. ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో లక్ష హెక్టార్ల చొప్పున ఆక్రమణలో ఉంది. గోవా, లక్షదీవులు, పుదుచ్చేరిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదు.

కేంద్ర రైల్వే, న్యాయశాఖల మంత్రుల రాజీనామా

కేంద్ర రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్, న్యాయశాఖా మంత్రి అశ్వనీకుమార్‌లు మే10న తమ పదవులకు రాజీనామా చేశారు. అశ్వనీకుమార్, బన్సల్ రాజీనామాల నేపథ్యంలో వారి శాఖలను ఇతర మంత్రులకు అదనంగా కేటాయించారు. కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి కపిల్ సిబల్‌కు న్యాయశాఖ, రవాణా శాఖ మంత్రి సీపీ జోషికి రైల్వే శాఖను అప్పగించినట్లు రాష్ట్రపతిభవన్ మే 11న ప్రకటించింది.

జల సంరక్షణ సంవత్సరంగా 2013 

2013ను జల సంరక్షణ సంవత్సర ంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ మే 9న ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబరులో ఆమోదించిన జాతీయ జలవిధాన కార్యాచరణలో భాగంగా జల సంరక్షణ సంవత్సరానికి పచ్చజెండా ఊపింది. ఏడాదంతా కేంద్ర జలవనరుల శాఖ నీటి పొదుపుపై పెద్దపెత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది.

పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం

పార్లమెంటు ప్రాంగణంలో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని మే 7న లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు.. రాజ్యసభ ఔటర్ లాబీ ముఖద్వారం వద్ద ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

భారీ ఓడరేవుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో భారీ ఓడరేవుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ రెండు ఓడరేవుల నిర్మాణానికి రూ.15,820 కోట్లు ఖర్చవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 5.40 కోట్ల టన్నుల నిర్వహణ సామర్థ్యంగల ఓడరేవును నిర్మిస్తారు. దీనికి రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులు అవసరం. ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాలుగా విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే కేంద్రం దుగరాజపట్నంపై మొగ్గుచూపింది. కొత్త ఓడరేవులను ప్రభుత్వ, ప్రెవేటు భాగస్వామ్యంతో చేపడతారు. వీటి నిర్మాణాన్ని కేంద్రం నోటిఫై చేయనుంది.

-భారీ ఓడరేవులు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. చిన్న ఓడరేవులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయి.

-దేశంలో ప్రస్తుతం 12 భారీ ఓడరేవులున్నాయి. అవి.. కోల్‌కతా-హల్దియా, పారాదీప్, విశాఖపట్నం, ఎన్నోర్, చెన్నై, వీవో చిదంబరనార్ (గతంలో ట్యుటికోరన్), కోచి, న్యూ మంగళూరు, మార్మగోవా, ముంబై, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కాండ్లా.

పర్యావరణ సూచీలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలో పర్యావరణ నిర్వహణ సూచీ (ఈపీఐ)-2012లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. నాణ్యమైన గాలి; నీరు, అటవీ సంరక్షణకు; చెత్త నిర్వహణకు అత్యుత్తమ పర్యావరణ అనుకూల విధానాలను అవలంబించినందుకుగాను ఆంధ్రప్రదేశ్‌కు ఈ గుర్తింపు లభించింది. జాబితాలో సిక్కిం రెండో స్థానంలో నిలవగా హిమాచల్‌ప్రదేశ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. హర్యానా (27), బీహార్ (30) స్థానంలో నిలిచాయి. చివరిస్థానం (35)లో లక్షద్వీప్ నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు

కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఏప్రిల్ 302011 జనాభా లెక్కలను విడుదల చేశారు. వీటి ప్రకారం

  1. రాష్ర్ట జనాభా 8.45 కోట్లు(కచ్చితంగా 8,45,80,777).
  2. 2001 లెక్కలతో పోల్చితే రాష్ర్ట జనాభా 11శాతం పెరిగింది.
  3. ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు.
  4. గ్రామీణ జనాభా 5,63,61,702
  5. పట్టణ జనాభా 2,82,19,075.
  6. అత్యధిక జనాభా ఉన్న జిల్లా-రంగారెడ్డి (27,41,239).
  7. అత్యల్ప జనాభా ఉన్న జిల్లా-విజయనగరం (23,44,474).
  8. స్త్రీ, పురుష నిష్పత్తి: 992/1000
  9. ఆరేళ్లలోపు పిల్లల్లో లింగ నిష్పత్తి- 939/1000
  10. జన సాంద్రత: 307
  11. అక్షరాస్యత- 67.02 శాతం (మహిళలు 59.15 శాతం, పురుషులు-74.88 శాతం)
  12. అక్షరాస్యతలో ప్రథమ స్థానం హైదరాబాద్(75.87 శాతం)
  13. అక్షరాస్యతలో చివరి స్థానంలో మహబూబ్‌నగర్- 55.04 శాతం
  14. రాష్ర్టంలో ఎస్టీలు- 6.59 శాతం
  15. రాష్ర్టంలో ఎస్సీలు- 16.41 శాతం
రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్‌ను మే 4న ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్‌కు రాష్ట్ర హోం మంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ప్రజా భద్రతా పర్యవేక్షణ, వ్యవస్థలో లోపాలను తొలగించడం వంటి విధులను ఈ కమిషన్ నిర్వర్తిస్తుంది. విధానపరమైప నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాల నిస్తుంది. పోలీసుల ఉత్తమ పనితీరుకు, వ్యవస్థాపరమైన లక్ష్యాలకు సంబంధించి ముందస్తు చర్యలకు సలహాలివ్వడం, పోలీసుల వత్తి పరమైన విధానాలకు సంబంధించి కూడా ఈ కమిటీ సూచనలిస్తుంది. ఇది జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ భద్రత మండలిమాదిరిగా రాష్ట్రస్థాయిలో పనిచేస్తుంది.

జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)కు కేంద్ర కేబినెట్ మే1న ఆమోదం తెలిపింది. పట్టణ పేదల ఆరోగ్య సంరక్షణకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు అనుబంధ కార్యక్రమంగా చేపడతారు. దేశవ్యాప్తంగా 50,000 పైగా జనాభా ఉన్న 779 నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీని వల్ల 7.75 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ కార్యక్రమం కింద ఐదేళ్లలో రూ. 22,507 కోట్లు వ్యయం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యయాన్ని 75:25 నిష్పత్తిలో పంచుకుంటాయి. ఇందులో కేంద్రం వాటా రూ.16,955 కోట్లు.

121 కోట్లకు చేరుకున్న భారత్ జనాభా
కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఏప్రిల్ 302011 జనాభా లెక్కలను విడుదల చేశారు. వీటి ప్రకారం భారత జనాభా మార్చి 1 నాటికి 121,07,26,932.
  1. 2001 జనాభా లెక్కలతో పోల్చితే పెరిగిన జనాభా 18.196 కోట్లు.
  2. 2001-11 మధ్య కాలంలో పెరిగిన జనాభా 17.7 శాతం (అంతకుముందు దశాబ్దంలో పెరిగిన జనాభాశాతం 21.5)
  3. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 83.85 కోట్ల మంది నివసిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 37.71 కోట్ల మంది ఉన్నారు.
  4. అక్షరాస్యత శాతం 73. ఇది 2001లో 64.8 శాతం.
  5. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2001లో ఇది 933.
అదనపు సొలిసిటర్ జనరల్ రాజీనామా
అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జి) హరేన్ రావల్ ఏప్రిల్ 30న తన పదవికి రాజీనామా చేశారు. బొగ్గు కుంభకోణంపై ిసీబీఐ స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టుకు ఆయన తెలిపిన సమాచారం అసత్యమని తేలడంతో రావల్ రాజీనామా చేశారు. 2009 జూలై 4 నుంచి ఆయన ఏఎస్‌జీగా ఉన్నారు.

కూడంకుళంకు సుప్రీం అనుమతి
వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. రక్షణ ఏర్పాట్లు బాగానే ఉన్నాయని నిపుణుల కమిటీ నిర్థారించినందున అనుమతిని ఇస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. దీర్ఘకాల ప్రయోజనాలు, దేశ ఆర్థిక వద్ధి దష్ట్యా కూడంకుళం అవసరమని అభిప్రాయపడింది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు అన్ని అనుమతులు సాధించాకే ఉత్పత్తిని ప్రారంభించాలని స్పష్టం చేసింది. 15 మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సందర్భంగా కూడంకుళానికి వ్యతికేకంగా ఉద్యమించిన వారందరిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆదేశించింది
ఏప్రిల్ 2013 జాతీయం ::.

              
తీర గస్తీనౌక రాజ్‌దూత్ప్రారంభం
తీర గస్తీనౌక రాజ్‌దూత్ను కోల్‌కతాలో ఏప్రిల్ 22న ప్రారంభించారు. ఈ నౌకను గార్డెన్ రీచ్‌షిప్ బిల్డర్‌‌స అండ్ ఇంజనీర్‌‌స సంస్థ నిర్మించింది. ఇన్‌షోర్ పాట్రోల్ వెజల్స్ (ఐిపీవీ)కు చెందిన ఎనిమిదిలో రాజ్‌దూత్ ఆరోది. అత్యంత ఆధునిక కమ్యూనికేషన్, నావిగేషన్ పరికరాలు ఉన్న ఈ నౌక 34 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. గస్తీ, వెతకడం, కాపాడడం, వైద్యసేవకు తరలించడం వంటి విధులను ఈ నౌక నిర్వహిస్తుంది.

బంగారు తల్లిపథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఆడపిల్లల చదువును పోత్సహించడానికి ఉద్దేశించిన బంగారు తల్లిపథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డిలో ఏప్రిల్ 28న ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు జననం నమోదైనప్పటి నుంచి కాలేజీ చదువు వరకూ ఏటా ప్రోత్సాహకాలను అందిస్తారు. మధ్యలో బడి ఆపకుండా చదివే అమ్మాయికి కాలేజీ చదువుల వరకూ మొత్తం ’ 55,500 ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 18 ఏళ్ల వరకు వివాహం చేసుకోకుండా 12వ తరగతి పూర్తి చేసిన ఆడపిల్లలకు ’ 50,000, డిగ్రీ పూర్తిచేస్తే మరో ’ 50,000 బహుమతిగా ఇస్తారు. ఈ ప్రోత్సాహకాలు ఇప్పటివరకు ఆడపిల్లలకు కల్పిస్తున్న ప్రయోజనాలకు అదనంగా ఉంటాయి.

స్థాయి సంఘాలకు చైర్మన్‌ల నియామకం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్థాయి సంఘాలకు చైర్మన్లను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ 24న ప్రకటించారు. మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి చైర్మన్లుగా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తొమ్మిది మందిని, ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి ముగ్గురిని నియమించారు. రాష్ర్ట శాసనసభ, శాసనమండలిలోని మొత్తం సభ్యులు ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ప్రతి సంఘంలో 31 మంది సభ్యులుగా ఉంటారు. బడ్జెట్‌లో శాఖల వారీగా జరిపిన కేటాయింపులపై స్థాయి సంఘాలు సమగ్రంగా చర్చించి నివేదికలను రూపొందిస్తాయి. ఆ స్థాయి సంఘాలు ఆమోదించిన పద్దులను ఉభ య సభలు రెండో సమావేశాల్లో ఆమోదిస్తాయి.

గుంతకల్ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఫైవ్ ఎస్ సర్టిఫికెట్
దక్షిణమధ్య రైల్వే పరిధిలోని గుంతకల్ డివిజన్‌కు క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియాఅందజేసే ప్రతిష్టాత్మక ఫైవ్ ఎస్ సర్టిఫికేషన్ అవార్డులభించింది. తద్వారా భారతీయ రైల్వేలో ఈ అవార్డు సాధించిన తొలి డివిజన్‌గా నిలిచింది. ప్రాధాన్యతాక్రమంలో ఫైళ్లు.. సేవల విభజన, క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం/అందించడం, పరిశుభ్రత, సేవలస్థాయి ప్రామాణీకరణ, ఈ నాలుగు అంశాల కొనసాగింపు... ఇలా ఐదు ముఖ్యమైన అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. జపాన్ భాషలో ఈ ఐదు పదాలు(ఆంగ్లంలో రాస్తే) ఎస్తో మొదలవుతున్నందున దీనిని ఫైవ్ ఎస్ సర్టిఫికేషన్ అవార్డుగా పిలుస్తారు.

అకాడమీల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాహిత్య, సంగీత, లలితకళా అకాడమీలను పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష సంస్కతి, నత్యం, కళలను పోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2012 డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల్లో వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వీటిని 1985లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది.

ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాష
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రెవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10 వతరగతి వరకు తెలుగు, ఆంగ్ల భాషలను తప్పనిసరిగా చదివేలా ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష అమలును మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

హైదరాబాద్‌లో యూఎన్‌డబ్ల్యూటీవో సదస్సు
తూర్పు ఆసియా, పసిఫిక్, దక్షిణ ఆసియాల 25వ పర్యాటక సమావేశాలు హైదరాబాద్‌లో ఏప్రిల్ 11 నుంచి మూడు రోజులు జరిగాయి. 21 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఈ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా యూఎన్‌డబ్ల్యూటీవో సుస్థిర పర్యాటక అభివద్ధి సమావేశం కూడా జరిగింది. సుస్థిర పర్యాటక రంగం అభివద్ధిలో అవలంబించాల్సిన ఉత్తమ వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. తూర్పు, పసిఫిక్, దక్షిణాసియాల తదుపరి పర్యాటక సమావేశం ఫిలిిఫ్పీన్స్‌లో, యూఎన్‌డబ్ల్యూటీవో సమావేశాన్ని 2015లో కాంబోడియాలో జరిపేందుకు నిర్ణయించారు.

ప్రాజెక్ట్ డయల్ -100 ప్రారంభం
పోలీసులు అత్యవసర సేవలు అందించే ప్రాజెక్ట్ డయల్-100’ను ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ఏప్రిల్ 11న ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ను జీవీకే ఈఎంఆర్‌ఐ-రాష్ట్ర పోలీసుశాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ 100 నెంబర్‌కు రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఫోన్ చేయవచ్చు. వారు సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించి స్పందించేటట్లు చూస్తారు. పోలీసులు బాధితుల వద్దకు వెళ్లి సేవలు అందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. డయల్ 100’ కేంద్రం ద్వారా ఇతర అత్యవసర సేవలైన మెడికల్, ఫైర్, ఇతర విపత్తు నిర్వహణ సేవలను అనుసంధానం చేస్తారు. ఈ వ్యవస్థను జీపీఎస్/ జీఐఎస్ సర్వర్‌ను అనుసంధానించడం వల్ల ఫోన్ చేసిన వారి ప్రదేశాన్ని గుర్తించి అక్కడికి పోలీసు వాహనాలు చేరడాన్ని పర్యవేక్షిస్తారు.

ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... న్యాయం ఆలస్యంగా అందుతుండటం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మహిళలు, వద్ధులు, పిల్లలు పట్ల జరిగే నేరాలను విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ న్యాయాలయాల వల్ల గ్రామీణులకు తక్కువ వ్యయంతో న్యాయం అందించే వీలవుతుందన్నారు. సమావేశంలో న్యాయశాఖమంత్రి అశ్వినీకుమార్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమస్ కబీర్ పాల్గొన్నారు.

స్వర్ణోత్సవాలు జరుపుకున్న సీబీఐ
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వర్ణోత్సవాలు ఏప్రిల్ 6న న్యూఢిల్లీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సుపరిపాలన లేకపోవడం సమాజంలో రుగ్మతలకు కారణమని, అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు ప్రదానం చేశారు.

ఏపీలో 10 కొత్త రెవెన్యూ డివిజన్లు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏడు జిల్లాల్లో 10 రెవెన్యూ డివిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 3న ఏర్పాటు చేసింది. అవి.. రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి (రంగారెడ్డి), గురజాల (గుంటూరు), దేవరకొండ (నల్గొండ), రామచంద్రాపురం (తూర్పుగోదావరి), అనకాపల్లి (విశాఖపట్నం), ఆత్మకూరు, నాయుడుపేట (నెల్లూరు), కళ్యాణదుర్గం, కదిరి (అనంతపురం). ఈ కొత్త డివిజన్లతో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 89కి చేరింది. 

మార్చి 2013 జాతీయం ::.

              
మిస్ ఇండియా 2013గా నవనీత్ కౌర్
ఫెమీనా మిస్ ఇండియా -2013గా నవనీత్ కౌర్ ధిల్లాన్ (చండీఘడ్) ఎంపికైంది. ఈ పోటీలో తొలి రన్నరప్‌గా విశాఖపట్నంకు చెందిన శోభితా ధూళిపాళ నిలిచింది. ఈమెను మిస్ ఇండియా ఎర్త్ 2013గా, రెండో రన్నరప్‌గా నిలిచిన జోయా అఫ్రోజ్(లక్నో)ను మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2013గా ప్రకటించారు.

అత్యాచార నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013’ పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు. మహిళలను వెంటాడటం, శంగారంలో ఉన్న వారిని చూడటం వంటి వాటిని శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించారు. యాసిడ్ దాడులకు పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్ష వంటివి బిల్లులోని ప్రధానాంశాలు.

1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు తీర్పు
1993 ముంబై పేలుళ్లపై సుప్రీం కోర్టు మార్చి 21న అంతిమతీర్పునిచ్చింది. ఈ దాడులకు కుట్రపన్నిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్‌కు కోర్టు మరణ శిక్షను ఖరారు చేసింది. మరో పది మంది నిందితులకు టాడా కోర్టు విధించిన మరణశిక్షను యూవజ్జీవ శిక్షగా మార్పు చేసింది. మరో 25 మందికి యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడనే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు ఐదేళ్లకు తగ్గించింది. ఈ కేసులో సంజయ్‌దత్ ఇప్పటికే ఏడాదిన్నరపాటు శిక్ష అనుభవించారు. పేలుళ్లకు తెప్పించిన ఆయుధాల కన్‌సైన్‌మెంట్‌లోని ఆయుధాలనే సంజయ్‌దత్ అక్రమంగా పొందాడని కోర్టు నిర్థారించింది. 1993 ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు.

ఆర్‌బీవీఆర్ రెడ్డి అప్పా
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) పేరును రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి రాష్ర్ట పోలీస్ అకాడమీ (ఆర్‌బీవీఆర్ రెడ్డి అప్పా)గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరామిరెడ్డి హైదరాబాద్ రాష్ట్ర పోలీసు కమిషనర్‌గా పని చేశారు.

తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరంగా 2013
తెలుగు భాష, సంస్కతిని పరిరక్షిస్తూ, భావితరాలకు అందించేందుకుగాను ప్రపంచ తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల మేరకు 2013ను తెలుగు భాష, సాంస్కతిక వికాస సంవత్సరంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 14న సాంస్కతికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తొలి మిహళా తపాలా కార్యాలయం
కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా దేశంలోనే తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించింది. అందరూ మహిళలే పని చేయడం ఈ కార్యాలయం ప్రత్యేకత.

ఐదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మార్చి 9న ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. వివరాలు..
నాగాలాండ్-అశ్వినీ కుమార్ (సీబీఐ మాజీ డెరైక్టర్)
ఒడిశా-ఎస్‌సీ జమీర్ (కాంగ్రెస్ నాయకుడు)
త్రిపుర గవర్నర్‌గా ఉన్న డీవై పాటిల్ బీహార్ గవర్నర్‌గా,
బీహార్ గవర్నర్‌గా ఉన్న దేవానంద్ కన్వర్ త్రిపుర గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న నిఖిల్ కుమార్ (ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్) కేరళ గవర్నర్‌గా బదిలీ అయ్యారు (గతేడాది జనవరిలో కేరళ గవర్నర్ ఎంఓహెచ్ ఫరూఖీ మరణించినప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భర ద్వాజ్ నిర్వర్తిస్తున్నారు).

కొత్త సీఎంల ప్రమాణం
నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో వరుసగా మూడోసారి మార్చి 5న ప్రమాణస్వీకారం చేశారు. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ మార్చి 6న ప్రమాణ స్వీకారం చేశారు. మాణిక్ సర్కార్ వరుసగా నాలుగో సారి సీఎం బాధ్యతలు స్వీకరించారు. మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా (కాంగ్రెస్) మార్చి 5న ప్రమాణస్వీకారం చేశారు. సంగ్మా వరుసగా రెండోసారి సీఎం పగ్గాలను చేపట్టారు.

పౌర సేవల బిల్లుకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలను నిర్దిష్ట కాల వ్యవధిలోగా అందించటాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన సంబంధిత బిల్లుకు కేంద్ర కేబినెట్ మార్చి 7న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ కార్యాలయం పౌరులకు అందించే సేవలను, సరుకుల వివరాలను తెలియజేసే ఒక పట్టికను విధిగా బహిరంగ పరచాల్సి ఉంటుంది. ఏ పనికి ఎంత సమయం పడుతుంది? సేవలు సరిగా అందనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అన్ని వివరాలను ఆ పట్టికలో తెలపాలి. ప్రతిపాదిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటానికి వీలుగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులను, సూచనలను స్వీకరించే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్రంలో, ప్రతి రాష్ట్రంలో ఒక కమిషన్‌ను నియమించాలని సూచించింది.

ముగిసిన మహా కుంభమేళా
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళామార్చి 10న (మహాశివరాత్రి రోజున) ముగిసింది. జనవరి 14న పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాద్) లో ప్రారంభమై 55 రోజులపాటు సాగిన ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో 12 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న మౌని అమవాస్య రోజున అత్యధికంగా నాలుగు కోట్ల మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అలహాబాద్ కుంభమేళా... ప్రపంచం మొత్తంలో ఒక కార్యక్రమం కోసం అత్యంత ఎక్కువ మంది ఒక్కచోట చేరే వేడుకగా ఇప్పటికే రికార్డు సష్టించింది.

వరంగల్‌కు ఉత్తమ వారసత్వ నగరం అవార్డు
జాతీయ పర్యాటక అవార్డుల్లో భాగంగా 2011-12 ఏడాదికిగాను ఉత్తమ వారసత్వ నగరం విభాగంలో వరంగల్ నగరానికి అవార్డు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వారసత్వ సంపదను కాపాడటం, పర్యాటకరంగ ఉద్యోగులకు నైపుణ్యం పెంచడం, పర్యాటకులకు ఆతిథ్య సేవల విస్తరణ, భద్రతను కల్పించేందుకు టూరిజం, పోలీస్ వ్యవస్థను పటిష్ట పరచడం వంటి అంశాలాధారంగా వరంగల్‌కు ఈ పురస్కారం దక్కింది.

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు
గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న తీర్పునిచ్చింది. బాబ్లీని కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి 2.74 టీఎంసీల నీటిని మాత్రమే మహారాష్ట్ర వినియోగించుకోవాలని సూచించింది. వర్షాకాలమంతా ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉంచాలని, వర్షాకాలంలో నదీ ప్రవాహానికి అడ్డంకి కల్పించరాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా నీటి పంపకాన్ని పర్యవేక్షించేందుకు ఒకకమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి మరొకరు సభ్యులుగా ఉంటారని తెలిపింది. కమిటీ చైర్మన్‌గా సీడబ్ల్యూసీ సభ్యుడు వ్యవహరిస్తారని చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణపై కమిటీకి దిశానిర్దేశం చేసింది. 1975లో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60 టీఎంసీల పరిమితికి లోబడే మహారాష్ట్ర నీటిని వాడుకుంటోందని అభిప్రాయపడింది. పోచంపాడు రిజర్వాయర్ పరిధిలో 0.6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున, అంతే పరిమాణంలో నీటిని మహారాష్ట్ర మార్చి 1న ఏపీకి విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. శ్రీరాంసాగర్ ముంపు ప్రాంతంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో పిటిషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్ మెట్రోకు అవార్డు
హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)కు బెస్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని హెచ్‌ఎంఆర్ ఎండీ ఏవీఎస్ రెడ్డి న్యూయార్క్‌లో జరిగిన ఆరో వార్షిక గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్కాన్ఫరెన్స్‌లో ఫిబ్రవరి 28న అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల నుంచి హెచ్‌ఎంఆర్‌ను గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఎంపిక చేసింది.

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఫిబ్రవరి 28న వెల్లడించింది. వివరాలు..

త్రిపుర: అధికార లెఫ్ట్‌ఫ్రంట్ విజయం సాధించి వరుసగా ఐదోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 60 సీట్లకు గాను 50 స్థానాల్లో లెఫ్ట్‌ఫ్రంట్ (సీపీఎం-49 స్థానాలు, సీపీఐ-1 స్థానం) గెలిచింది.

నాగాలాండ్: నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 59 అసెంబ్లీ స్థానాలకు గాను 37 సీట్లలో గెలుపొందింది.

మేఘాలయ: మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) గెలిచింది.

ఫిబ్రవరి 2013 జాతీయం ::.

              
కావేరి తీర్పుపై నోటిఫికేషన్
కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పును కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న నోటిఫై చేసింది. ప్రస్తుత నోటిఫికేషన్ 90 రోజుల్లోగా అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత కర్ణాటక విధిగా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జస్టిస్ ఎన్.పి. సింగ్ చైర్మన్‌గా, ఎన్.ఎన్.రావు, సుధీర్ నారాయణ్‌లు సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరిలో కావేరీ జలాల పంపిణీపై ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. కావేరి బేసిన్‌లో దిగువ కోలెరూన్ ఆనకట్ట వద్ద 740 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు నిర్ధారించింది. తమిళనాడుకు 419 టీఎంసీలు (వాస్తవ డిమాండ్ 562 టీఎంసీలు), కర్ణాటకకు 270 టీఎంసీలు (వాస్తవ డిమాండ్ 465 టీఎంసీలు), కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నట్టు అందులో వివరించింది. పర్యావరణ పరిరక్షణకు 10 టీఎంసీల నీటిని రిజర్వ్ చేసింది. ఈ తీర్పుపై కర్ణాటక, తమిళనాడు రెండూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అప్పట్నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దాంతో ఇంతకాలం తీర్పును గెజిట్‌లో ప్రచురించకపోవడంతో అమలు కాలేదు. కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

బీహెచ్‌ఈఎల్‌లో బీహెచ్‌పీవీ విలీనం
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్‌ఈఎల్)లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్ (బీహెచ్‌పీవీ) విలీనానికి ఫిబ్రవరి 21న కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. దీంతో బీహెచ్‌పీవీ... బీహెచ్‌ఈఎల్‌కు అనుబంధ కంపెనీగా మారనుంది. బీహెచ్‌పీవీని 1966లో విశాఖపట్నంలో స్థాపించారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ20 ప్రయోగం విజయం
ఇస్రో ఫిబ్రవరి 25న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) నుంచి నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సీ20 ప్రయోగం విజయవంతమైంది. భారత్-ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన 409 కిలోల సరళ్ (శాటిలైట్ ఫర్ ఆర్గోస్ అండ్ అల్టికా)తోపాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-20 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సముద్రాల అధ్యయనానికి తోడ్పడే సరళ్ ఉపగ్రహంతోపాటు కెనడాకు చెందిన 148 కిలోల సఫైర్, 74 కిలోల నియోశాట్, ఆస్ట్రియాకు చెందిన 14 కిలోల ఎన్‌ఎల్‌ఎస్ 8.1 (యూనిబ్రైట్), ఎన్‌ఎల్‌ఎస్ 8.2(బ్రైట్), డెన్మార్క్‌కు చెందిన 3 కిలోల ఎన్‌ఎల్‌ఎస్ 8.3, ఇంగ్లండ్‌కు చెందిన 6.5 కిలోల స్టాండ్-1 ఉపగ్రహాలను విజయవంతంగా లక్ష్యానికి చేర్చింది. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ20ని నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించారు. మొత్తం 229.7 టన్నుల బరువుతో అది నింగికేసి దూసుకెళ్లింది.

నిర్లవణీకరణ ప్రాజెక్ట్ ప్రారంభం
సముద్ర జలాలను తాగు నీరుగా మార్చేందుకు ఉద్దేశించిన నిర్లవణీకరణ ప్రాజెక్ట్‌ను తమిళనాడు కాంచీపురం జిల్లాలోని నెమిలి వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఫిబ్రవరి 22న ప్రారంభించారు. దీన్ని రూ.871 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిత్యం 265 మిలియన్ లీటర్ల సముద్ర నీటిని 100 మిలియన్ లీటర్ల తాగు నీరుగా మార్చనున్నారు. దీనివల్ల చెన్నైలోని వేలాచ్చారి, పళ్లిపట్టు, తిరువాన్మయూరులలో నివసిస్తున్న సుమారు 15 లక్షల మందికి మంచి నీరు అందనుంది.

పోఖ్రాన్‌లో వైమానిక విన్యాసాలు
భారత వాయుసేన (ఐఏఎఫ్) తొలిసారిగా పగలు-రాత్రి విన్యాసాలతో తన యుద్ధ పాటవాన్ని ప్రదర్శించింది. ఫిబ్రవరి 22న రాజస్థాన్‌లోని థార్ ఎడారి సమీపంలోని పోఖ్రాన్ వద్ద ఉక్కు పిడికిలి 2013’ పేరుతో చేపట్టిన ఈ యుద్ధ విన్యాసాల్లో ఎస్‌యూ-30 ఎంకేఐ, మిరాజ్2000, జాగ్వర్, మిగ్-21 వంటి ఫైటర్ జెట్‌లు, మిసైల్ లాంచర్లు, హెలికాప్టర్‌లు పాల్గొన్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మొదటి జియోథర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంలో మొదటి జియోథర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), ఛత్తీస్‌గఢ్ పునర్వినియోగ ఇంధన అభివద్ధి సంస్థల మధ్య ఫిబ్రవరి 16న ఒప్పందం కుదిరింది. భూమి అంతర్భాగంలో నిల్వఉన్న ఉష్ణం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి పునర్వినియోగ ఇంధనాల గుర్తిం పును జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత మూడు దశాబ్దాలుగా చేపడుతుంది. విద్యుత్ ఉత్పత్తికి అనువైన 340 ఉష్ణ ప్రాంతాలను ఇది గుర్తించింది.

2171 మందిని అనర్హులుగా ప్రకటించిన ఎన్నికల సంఘం
లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలకు పోటీ చేసిన 2171 మందిని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 15న అనర్హులుగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటిం చిన 30 రోజులలోపు ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించకపోవడంతో వారిని అనర్హులుగా గుర్తించింది. వీరిలో చాలావరకు ఎన్నికల్లో ఆషామాషీగా పోటీ చేసినవారే. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద అనర్హత వేటు పడినవారు మరో మూడేళ్లపాటు ఎన్ని కల కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదు. ఈ అనర్హత పొందిన వారిలో అత్యధికంగా 260 మంది మహా రాష్ర్టకు చెందినవారున్నారు.

రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య పథకం ప్రారంభం
బాలల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య పథకాన్నియూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఫిబ్రవరి 6న మహారాష్ట్రలోని ఫాల్ఘార్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద జననానికి ముందే వైకల్యానికి కారణమయ్యే వ్యాధులు, లోపాలు, ఇతర సమస్యలను గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు. దీన్ని చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్కార్యక్రమంగా దేశంలో 27 కోట్ల మంది పిల్లలకు వర్తింపజేస్తారు. దేశంలోని అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు.

సైన్యంలో రుద్రహెలికాప్టర్లు
హెలికాప్టర్ రుద్రను బెంగళూరులో ఫిబ్రవరి 8న ఏరో ఇండియా-2013 ప్రదర్శనలో సైన్యానికి అప్పగించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆయుధాలు కలిగి ఉండే తొలి హెలికాప్టర్ రుద్ర’. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సైన్యానికి అందజేస్తున్న 60 హెలికాప్టర్లలో మొదటిది ఇది. త్వరలో తొలి రుద్రహెలికాప్టర్ స్వాడ్రన్ అందుబాటులోకి రానుంది. ఒక్కో స్వాడ్రన్‌లో 10 రుద్ర హెలికాప్టర్లు ఉంటాయి. ఎం.కె.-4 తరహాకు చెందిన తేలికపాటి ఆధునిక హెలికాప్టర్ రుద్ర’. ఆయుధాలు, లక్షిత వ్యవస్థ, హెచ్చరిక, ప్రతిచర్యలు లెక్కించే, కాపాడుకునే వ్యవస్థలు ఈ హెలికాప్టర్‌లో ఉంటాయి.

బెంగళూరులో ఏరో ఇండియా-2013’ ప్రారంభం
ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా-2013’ బెంగళూరులోని యలహంక వద్ద రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోని ఫిబ్రవరి 6న ప్రారంభించారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ప్రదర్శన ఐదు రోజుల పాటు కొనసాగింది. సైనిక, పౌర విమాన, అవియోనిక్స్ రాడార్స్‌కు చెందిన అత్యాధునిక అంతర్జాతీయ టెక్నాలజీని ఇక్కడ ప్రదర్శించారు. దేశ, విదేశాలకు చెందిన 600 కంపెనీలు తమ ఉత్పత్తులు ప్రదర్శించాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ వంటి 27 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు
పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు (43)ను ఫిబ్రవరి 9న తీహార్ జైలులో ఉరి తీశారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఫిబ్రవరి 3న తిరస్కరించడంతో ఉరి అమలు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి కేసులో నిందితుడు. ఆ దాడిలో 9 మంది మరణించారు. ఈ దాడిలో ప్రధాన కుట్రదారుడు గురుకు 2002 డిసెంబర్‌లో ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించగా, 2005 ఆగస్ట్ 4న దాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది. తర్వాత అఫ్జల్ గురు భార్య క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. గురు స్వస్థలం కాశ్మీర్ లోయలోని సోహార్ సమీపంలోని దోల్‌ఘా గ్రామం. దేశంలో గత కొద్ది నెలల్లో అమలు జరిగిన రెండో మరణశిక్ష ఇది. 2008 నవంబర్ 26న ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012 నవంబర్ 21న ఉరి తీశారు.

అనంతపూర్ పేరు అనంతపురంగా మార్పు
అనంతపూర్ జిల్లా పేరును అనంతపురంగా మార్చాలని ప్రభుత్వం ఫిబ్రవరి 8న నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గెజిట్‌లో ప్రచురించేందుకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల్లో అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌కు తెలియజేయొచ్చు.

భెల్, గెయిల్‌కు మహారత్న
ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది. దీంతో ఈ రెండు సంస్థలు రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు నవరత్న హోదా మాత్రమే ఉంది. నవరత్న కంపెనీలకు రూ. 1,000 కోట్ల దాకా పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

ఢిల్లీ సుస్థిరాభివద్ధి సదస్సు
13వ ఢిల్లీ సుస్థిరాభివద్ధి సదస్సు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ది గ్లోబల్ ఛాలెంజ్ ఆఫ్ రిసోర్స్-ఎఫిషియంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్అనే ఇతివత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. దీనికి 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదానం చేసిన
అవార్డుల వివరాలు..

2013 సుస్థిరాభివద్ధి అవార్డు: సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మైఖేల్‌కు దక్కింది. ఆయన తరఫున సీషెల్స్ విదేశాంగ మంత్రి జీన్ పౌల్ ఆడమ్ ఈ అవార్డు అందుకున్నారు. జార్జెస్కూ-రోజెన్ అవార్డు: కోజ్ మయామి (తొకుషిమా యూనివర్సిటీ), యాక్సియన్ ఎకొలాజికా అండ్ ఆయిల్ వాచ్ సంస్థకు దక్కింది. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టీఈఆర్‌ఐ) అనే సంస్థ 2001 నుంచి ఢిల్లీ సుస్థిరాభివద్ధి సదస్సు (డీఎస్‌డీఎస్)ను నిర్వహిస్తోంది.

జనవరి 2013 జాతీయం ::.

              
మూడు కొత్త హైకోర్టులు
కేంద్ర ప్రభుత్వం మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్తగా మూడు హైకోర్టులను ఏర్పాటు చేసింది. త్రిపుర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి నలుగురు న్యాయమూర్తులు.. మేఘాలయ, మణిపూర్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తితో కలిపి ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఈ మూడు కొత్త హైకోర్టులతో కలిపి దేశంలో హైకోర్టుల సంఖ్య 21 నుంచి 24కు పెరిగింది.

27 శాతం పెరిగిన పాఠశాలలు
దేశంలో 2002-09 మధ్య పాఠశాలల సంఖ్య 27 శాతం పెరిగినట్లు ఎనిమిదో ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వే (ఏఐఈఎస్‌టీ) పేర్కొంది. అదే సమయంలో ఉపాధ్యాయుల సంఖ్య కూడా 30 శాతానికిపైగా పెరిగినట్లు తెలిపింది. ఈ సర్వేను జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) జనవరి 22న విడుదల చేసింది. దీన్ని సర్వశిక్షా అభియాన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని లెక్కించేందుకు, అమలును పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తారు.

ఆసియా-పసిఫిక్ నేత్ర వైద్యుల సదస్సు
ఆసియా-పసిఫిక్ నేత్ర వైద్యుల సదస్సును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో జనవరి 17న ప్రారంభించారు. 75 శాతం కేసుల్లో అంధత్వాన్ని, 85 శాతం కేసుల్లో దష్టి లోపాన్ని సరి చేయవచ్చని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆసియా-పసిఫిక్ నేత్ర వైద్యుల సంఘం అధ్యక్షుడు ఫ్రాంక్ మార్టిన్, అంతర్జాతీయ నేత్ర వైద్యుల మండలి అధ్యక్షుడు బ్రూస్ స్పివే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.

స్వామి వివేకానందపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల
స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 12న ప్రత్యేక తపాలా బిళ్ల (పోస్టల్ స్టాంప్)ను న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. స్వామి వివేకానంద బోధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

కోచిలో ప్రవాసీ భారతీయ దివస్
కేరళలోని కోచిలో 11వ ప్రవాసీ భారతీయ దివస్‌ను జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించారు. ఇదే వేదికపై గదర్ ఉద్యమంవందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జనవరి 8న ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం, తమ విజ్ఞానాన్ని అందించడం ద్వారా వారు దేశ సామాజిక, ఆర్థిక అభివద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్‌కు భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ భారత ఆర్థిక వద్ధిలో పాల్పంచుకోవాలంటూ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. 40 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఎంగేజింగ్ డయాస్పొరా-ది ఇండియన్ గ్రోత్ స్టోరీఅనే ఇతివత్తంతో ఈ సదస్సు జరిగింది. 2003 జనవరి నుంచి ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తున్నారు.

మహా కుంభమేళా ప్రారంభం
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక, మతపరమైన వేడుకగా పేరొందిన మహా కుంభ మేళా జనవరి 14న పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాద్)లో ప్రారంభమైంది. మార్చి 10న మహా శివరాత్రి దాకా 56 రోజులపాటు జరిగే ఈ ఉత్సవానికి దాదాపు పది కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అలహాబాద్ కుంభమేళా... ప్రపంచం మొత్తంలో ఒక కార్యక్రమం కోసం అత్యంత ఎక్కువ మంది ఒక్కచోట చేరే వేడుకగా ఇప్పటికే రికార్డు సష్టించింది.

2001లో అలహాబాద్‌లో జరిగిన పూర్ణ కుంభమేళాలో 6 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు. పులికాట్ సరస్సుకు అధిక సంఖ్యలో వలస వచ్చే ఫ్లెమింగో పక్షుల ప్రాధాన్యతను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహించింది. గుజరాత్‌లోని రాణాఆఫ్ కచ్ నుంచి ఈ పక్షులు వేలాది సంఖ్యలో ఇక్కడకు వలస వస్తాయి.

నగదు బదిలీ పథకం ప్రారంభం
దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 20 జిల్లాల్లో జనవరి 1న ప్రారంభించింది. తొలుత ఈ పథకాన్ని 51 జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించినా.. లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేకపోవడం వంటి కారణాలతో 20 జిల్లాలకే పరిమితం చేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్టెపెండ్‌లు, వితంతు పింఛన్లు, ఇందిరా మాతృత్వ యోజన, ధనలక్ష్మి పథకం తదితర ఏడు పథకాల కింద తొలి విడతలో నగదు బదిలీచేపట్టనున్నారు. ఆహార పదార్థాలు, ఎరువులు, డీజిల్, కిరోసిన్‌ల సబ్సిడీపై నగదు బదిలీని ప్రస్తుతానికి వాయిదా వేశారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో జనవరి 6న నగదు బదిలీ పథకం ప్రారంభమైంది. వచ్చే ఆగస్టు నాటికి నగదు బదిలీ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేస్తారు. తొలిదశలో ఐదు పథకాలకే(పింఛన్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, జననీ సురక్ష యోజన, బాల కార్మిక పాఠశాల విద్యార్థుల స్టయిపెండ్) నగదు బదిలీ పథకాన్ని కుదించారు.
www.sakshieducation.com

No comments: